రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ

- 2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తీసిన వర్మ
- తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బండారు వంశీకృష్ణ ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన గుంటూరు సీఐడీ పోలీసులు
ఇదే సమయంలో వర్మకు మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... 2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను వర్మ తీశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారంటూ గత ఏడాది నవంబర్ 29న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్మపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.